Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని లయన్స్క్లబ్ ఆస్పత్రి సమీపంలోని ఈడబ్ల్యూఎస్ వద్ద భూగర్భ డ్రయినేజీ పైప్లైన్ మార్చాలని స్థానిక మహిళలు కార్పొరేటర్ గొల్లూరి అంజయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటు చేసిన పైపులైన్లు ఉండడంతో తరచూ ఈ సమస్య వస్తుందని, దీనిపై అధికారులతో చర్చించి నూతన పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచినట్టు తెలిపారు. అలాగే రోడ్లు, డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు వంజరప్రవీణ్, శేఖర్నాయక్, మహిళలు సరిత, లలిత, సుజాత పాల్గొన్నారు.
కాలనీని శుభ్రంగా
ఉంచుకునేందుకు పాటుపడాలి : అంజయ్య
కాలనీని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని హెచ్బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ రోడ్డు నెంబరు-2లో షాన్ హైదరాబాద్...శాందార్ హైదరాబాద్లో భాగంగా పరిసరాలను శుభ్రం చేసి, ముగ్గులు వేశారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ..అన్ని కాలనీలు శుభ్రంగా ఉండేందుకు సంక్షేమ సంఘాలు, ప్రజలు బాధ్యత తీసుకొని రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వంజర ప్రవీణ్, సురేష్, మల్లారెడ్డి, రమణ, జీహెచ్ఎంసీ అధికారులు నర్సింగరావు, భవాని, వనజ, యాకస్వామి, యాదిగిరి పాల్గొన్నారు.