Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలోచన సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
అవినీతిని నిర్మూలించాలంటే పౌర సేవల చట్టం లాంటి పకడ్భందీ చట్టం తీసుకువస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమవుతోందని ఆలోచన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి, గౌరవ సలహాదారు బండారు రామ్మోహనరావు అన్నారు. గురువారం చైతన్యపురిలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు లంచాలు తీసుకోమని ప్రమాణాలు చేస్తే సరిపోదని, దానికి వ్యవస్థాపరమైన సంస్కరణలు కావాలని కోరారు. వ్యక్తి మారితే అవినీతి పోదని వ్యవస్థలో మార్పు రావాలన్నారు. పారదర్శకత జవాబుదారీతనంతో కూడిన సేవలు ప్రజలకు లంచం లేకుండా అందాలంటే, రైట్ టూ సర్వీసెస్ యాక్ట్, రావాల్సిందేనన్నారు. కేసీఆర్ మున్సిపల్ కొత్త చట్టంలో హక్కుగా పౌర సేవలను చేరుస్తామని చెబుతున్నారని కేవలం మున్సిపల్ చట్టం మారిస్తే సరిపోదన్నారు. పౌర సేవల చట్టం ప్రవేశపెట్టి సిటిజన్ చార్టర్ల ద్వారా పనులు చేయించాలని కోరారు. నిర్ణీత సమయంలో అందక పోయిన పౌరులకు జీతభత్యాలలో జరిమానాలు వసూలు చేసి ఇప్పించాలని వారు కోరారు.