Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూ ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వినతి
- రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శ్రావణ్ కుమార్
నవతెలంగాణ-సుల్తాన్బజార్
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కోరినట్టు రాష్ట్ర ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ జాట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శ్రావణ్ కుమార్ తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీలో రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబుయాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టం ప్రకారం సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని మంత్రిని కోరినట్టు తెలిపారు. ఈ సమస్యలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని త్వరలోనే అమలు చేసేలా చర్యలు చేపడుతామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన కార్యక్రమంలో నాయకులు మహిళ అధ్యక్షురాలు సంతోషి, డి.కరుణ, కే.కిరణ్, రెండో ఎఎన్ఎం నాయకురాలు సరోజా, సుజాత, స్వరూప, మమత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.