Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ బీసీ సంఘం ప్రతినిధులు గురువారం మంత్రి మల్లారెడ్డిని కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సాయిని అమృతం మాట్లాడుతూ..బోడుప్పల్ మున్సిపల్తో పాటు మేడ్చల్ జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పరిధిలో ఉండే బీసీలకు సముచిత స్థానం కల్చించేలా చొరవ చూపాలని మంత్రిని కోరారు.ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు దొర్నాల విజరు కుమార్, నామిని ఓంకార్, వడ్డెపల్లి నర్సింగ్ రావు, పిట్టల శ్రీనివాస్ పాల్గొన్నారు.