Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఎస్ఐ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డికి వినతి
నవతెలంగాణ-నాచారం
ఈఎస్ఐ సొసైటీ ఏర్పాటును వెంటనే నిలిపివే యాలని కోరుతూ ఈఎస్ఐ పరిరక్షణ జేఏసీ నాయకులు మంత్రి మల్లారెడ్డికి గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈఎస్ఐ ఆస్పత్రులను పరిరక్షించు కునేందుకు వీలుగా జేఏసీని ఏర్పాటు చేసినట్టు చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు.కార్మికులకు వైద్యుసేవ లందించే ఈఎస్ఐలను సోసైటీలుగా విభజించడం వలన అవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోతా యన్నారు. వెంటనే ఈఎస్ఐ ఆస్పత్రులను సోసైటీలు చేయకుండా కేంద్ర ప్రభుత్వపై వత్తిడి తీసుకోచ్చేలా కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. దీంతో పాటు నాచారం ఈఎస్ఐని నూతన భవనంలోనికి మార్చాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఈఎస్ఐ సోసైటీ ఏర్పాటును అడ్డుకుంటానని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు డా.కళ్యాణ్, డా.రమేష్, కృష్ణ, నగేష్చారి, మోహన్, వేణు, కాంతిసాగర్, శారద పాల్గొన్నారు.