Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి
- వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అటవీ భూములను గ్రామాల వారీగా సర్వేచేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు .గురువారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ భూము లను సర్వేచేసి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎడీ సర్వేయర్ను ఆదేశించారు.ఫారెస్ట్ భూములకు బౌం డరీలు ఏర్పాటు చేసి చుట్టు ఫెన్సింగ్ వేసి పరిరక్షిం చాలని జిల్లా ఫెరెస్ట్ అధికారి సుధాకర్రెడ్డిని కోరారు. చెరువుల పరిరక్షణకు చెరువులను సర్వేచేసి ఎప్టిఎల్ పరిధిని నిర్ణయించాలని, ఇప్పటివరకు జిల్లాలో సర్వేచేయగా మిగిలిన 9 చెరువులను వెంటనే సర్వే పూర్తిచేసి రెవెన్యూ రికార్డుల ప్రకారం రికాన్సిలేషన్ చేయాలని జిల్లా ఇరిగెషన్ అధికారిని ఆదేశించారు. జిల్లాలోని అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో, మండల పరిధిలో ఎంపీడీవో, ఈఓపిఆర్డీ, తహ సీల్దార్, జిల్లాస్థాయిలో డీపీవో, ఆర్డివో జాయింట్ సంతకాలతో అక్రమ లేఅవుట్లలిస్ట్ను నోటిఫై చేసి వాటి వివరాలను జిల్లా రిజిస్టార్, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్టార్కు, సీసీఎల్ఏ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశిం చారు. నిరుపయోగంగా ఉన్న భూములు గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారు లను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో మధుకర్రెడ్డి, డీపీవో రవికుమార్, జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి మంజులా, ఆర్డిఓలు లచ్చిరెడ్డి, మధుసూదన్ పాల్గొన్నారు.