Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లాలో నాలుగు..
- రంగారెడ్డి జిల్లాలో మూడు..
- ప్రభుత్వం నిర్ణయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగర శివారులలో మున్సిపాల్టీలను ప్రభు త్వం కార్పొరేషన్లుగా అప్గ్రెడేషన్ చేసింది. ఈ నేపథ్యంలోనే పురపాలక కొత్త చట్టంలో అవస రమైన నిబంధనలను పొందుపరిచింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో కార్పొరేషన్ల సంఖ్య ఎని మిదికి పెరిగింది. గ్రేటర్కు చుట్టూ ఉన్న మేడ్చల్ జిల్లాలో నాలుగు, రంగారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది. మేడ్చల్ జిల్లాలో బోడుప్పల్, ఫీర్జాదీ గూడ, జవహర్నగర్, నిజాంపేట్ మున్సిపాల్టీలను కార్పొ రేషన్లుగా మార్చింది. రంగారెడ్డి జిల్లాలో బండం గ్పేట్, బండ్లగుడ జాగీర్లతో పాటు మీర్పేట్, జిల్లెలగుడ మున్సిపాలిటీలను కలిపి మీర్పేట్ కార్పొరేషన్గా మార్చింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల కోసం కసరత్తు పూర్తిచేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తారా? యధావిధిగా నిర్వహిస్తారా? చూడాల్సిందే.