Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధూల్పేట్
పాతబస్తీ శాలిబండ నివాసి, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్నారాయణ ముదిరాజ్కు గ్లోబల్ పీస్ అవార్డు-2019 అవార్డు వరించింది. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా(చికాగో) చెందిన అమీర్ అలీఖాన్ గ్లోబల్ పీస్ అండ్ ట్రస్ట్ సంస్థ, గ్లోబల్ పీస్ అవార్డు-2019ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య, ఏపీ హ్యుమన్ రైట్ కమిషన్ మాజీ సభ్యులు, మాజీ జస్టిస్ ఇస్మాయిల్లు శాలువ వేసి, మెమోంటోలతో ఘనంగా అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30ఏండ్లుగా నగరంలో, పాతబస్తీలో ప్రత్యేకంగా శాంతి సామరస్యం కోసం, పర్యావరణ, పరిరక్షణ, జాతీయ సమైక్యత, ఏయిడ్స్, క్షయలపై అవగాహన కిడ్నీ, కంటి సమస్యలపై చేసిన కార్యక్రమాలను గుర్తుచేశారు. ఈ అవార్డును సుబేదార్ అమీర్ అలీ ఖాన్ గ్లోబల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు ఫారూఖ్ అలీఖాన్లు పాల్గొన్నారు.