Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
400 ఏండ్లుగా తెలంగాణలో నివాసముంటున్న గౌలి సామాజిక వర్గాన్ని గుర్తించాలని తెలంగాణ రాష్ట్రీయ గౌలి సమాజ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఆదివారం అబిడ్స్లోని సంఘం కార్యాలయంలో అక్టోబర్ 5న కోటి వివేకవర్థిని కళాశాల గ్రౌండ్లో గౌలి సమాజ్ మహిళలు నిర్వహించ బోయే బతుకమ్మ, దుర్గా నవరాత్రి ఉత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రీయ గౌలి సమాజ్ అధ్యక్షులు వెంక టేష్ గౌలి మాట్లాడుతూ.. గౌలి సమాజాన్ని సంచార జాతులుగా గుర్తించి, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌలి సమాజ్ ప్రతినిధులు వినోద్, లక్ష్మణ్, రఘు, సిద్దు, విజరు, పద్మజా, శ్రుతి, గీత, ప్రీతి పాల్గొన్నారు.