Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏజేఆర్కాలనీలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కాలనీ అధ్యక్షుడు కె.ప్రమోద్కుమార్ తెలిపారు. ఆదివారం ఏజేఆర్కాలనీలో కాలనీ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకు న్నారు. కాలనీ అధ్యక్షులుగా ప్రమోద్కుమార్, ఉపాధ్యాక్షులుగా రాములు, శ్రీహరి, ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా దిలీప్రెడ్డి, సహయ కార్యదర్శిలుగా రవికుమార్, క్రాంతికు మార్, మహేష్గౌడ్, సంయుక్త కార్యదర్శిగా యాదయ్యగౌడ్, కోశాధికారిగా నర్సింహాచారి, సాంస్కృతిక కార్యదర్శిగా సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శ్రీనివాస్, వినోద్సాగర్, జగన్, రాజ్కుమార్, మరికొంత మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నర్సింగరావు, రామాంజనేయులు, శ్రీకాంత్, రామకృష్ణ, శ్రవణ్నాయక్, రామోహన్ పాల్గొన్నారు.