Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట
మహేశ్వరం నియోజకవర్గ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునితారెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఆర్కెపురంలో టీఆర్ఎస్వీ నాయకులు ముచ్చింతల జగన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆర్కెపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పార్టీని ఎంతో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అనంతరం సునితారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకవచ్చి వారికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కెపురం డివిజన్ టీఆర్ఎస్ యూత్వీంగ్ నాయకులు బాలుశ్రీ, జాహెద్, శ్రీకాంత్గౌడ్, రమేష్, మహిళా నాయకురాలు రజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.