Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మెహిదీపట్నం
ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో వుండి ఆసిఫ్నగర్ డివిజన్ అభివృద్దికి పాటుపడతానని టీఆర్ఎస్ ఆసిఫ్నగర్ డివిజన్ అధ్యక్షులు ఎం.విద్యాసాగర్ అన్నారు. ఆసిఫ్నగర్లోని దత్తాత్రేయ కాలనీలో ఆదివారం టీఆర్ఎస్ జెండా ఎగరవేసిన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వల్ల వచ్చే పదేండ్ల వరకకు టీఆర్ఎస్కు తిరుగులేదన్నారు. ప్రజా సమస్యలను తీర్చేందుకు తనవంతు కృషి చేస్తూ టీఆర్ఎస్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్, మెంబర్ షిప్ డ్రైవ్ ఇన్చార్జి జహంగీర్ పాషా టీఆర్ఎస్ నాయకులు మురళిధర్, జాకి ఉల్లాఖాన్, భాసిత్ సంజరు, మహిళ నాయకురాలు రజిని, విజయ, విజయలక్ష్మీ, కార్యకర్తలు పాల్గొన్నారు.