Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలై వైద్యం చేయించుకునే స్తోమతలేని నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలతో ఎంతో మేలు జరుగుతుందని బహుజన రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కౌలె.జగన్నాథం అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని సాగర్ రోడ్డు, సాగర్కాంఫ్లెక్స్లో నిరుపేదలకు ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయన హజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఇన్చార్జిలు భాషా, సత్యనారాయణ, బహుజన రాజ్యం పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జీ కె.ఆభిషేక్ తదితరులు పాల్గొన్నారు.