Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
వర్షాకాలంలో ప్రజలకు వస్తున్న వివిధ రకాల వ్యాధుల నివారణకు ఉచిత వైధ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు బాలాపూర్ ప్రాధమి క ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉమాదేవి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాపూర్ వీకర్ సెక్షన్ కాలనీ లలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బడం గ్పేట మున్సిపాలిటీ 14వ వార్డు మాజీ కౌన్సిలర్ దండు గణేష్ ముదిరాజ్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బొర్ర జగన్రెడ్డిలు అతిథులు గా హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 300లకు పైగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాం టి విషజ్వరాలు రావన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మాజీ ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, సాంబశివ, శ్రీనివాస్, గణేష్, శంకర్, శ్రీకాంత్, శ్రీశైలం, రమేష్, కిశోర్, నాగరాజు, నర్సింగరావు, హెచ్ఈఓ వినోద్కుమార్, హెల్త్సూపర్ వైజర్ గోవింద్రెడ్డి, ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.