Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
జనవిజ్ఞాన వేదిక రిటైర్డ్ ఇంజినీర్ ఎల్వీ.కృష్ణారావు ఆధ్వర్యంలో విక్టోరియల్ మోమోరియల్ హౌం రెసిడెన్సియల్ స్కూల్ అనాథ విద్యార్థులకు ఆదివారం దుస్తుల పంపిణీ చేశారు. కృష్ణారావు జన్మదిన వేడుకలను అనాథ విద్యార్థుల మధ్య కేక్కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం 125మంది బాలికలకు రెండు జతల చె ప్పుల దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అనాథల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనం దంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అనాథలను ఆదుకుని వారి విద్యాబి వృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి పివీ.రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, సూపరెండెంట్ లక్ష్మిపార్వతి, వార్డెన్ మాలతి, జనవిజ్ఞానవేదిక జాతీయ కార్యదర్శి స్వరాజ్య లక్ష్మి, ఉపాధ్యక్షులు విక్రమ్, సభ్యులు అనురాధ తదితరులు పాల్గొన్నారు.