Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అబ్దుల్లాపూర్మెట్
తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి గ్రామాన్ని పారిశుధ్య రహితంగా ఉంచాలనే చెత్తబుట్టల పంపిణీ చేయడం జరిగిందని ఎంపీపీ బుర్రరేఖ మహేందర్ అన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్మెట్ మండలం, గుంతపల్లి గ్రామంలో సర్పంచ్ కరిమెల వెంకటేష్ ఆధ్వర్యంలో చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుర్రరేఖ మహేందర్ మాట్లాడుతూ గ్రామాన్ని స్వచ్ఛతగా ఉంచుకోవాలనే ఉద్ధేశంతోనే చెత్తబుట్టలు పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడవద్దని సూచించారు. డ్రయినేజీ, పారిశుధ్య సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బింగదాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.