Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
ప్రజా సేవను బాధ్యతతో చేసినప్పుడే అభివృద్ధిలో ముందుకు సాగుతామని హయత్నగర్ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి అన్నారు. ఆదివారం ఆటోనగర్లోని జాతీయ రహదారి పక్కన ఉన్న చెత్త డంప్యార్డ్ వద్ద ఉన్న చెత్తను జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి కార్పొరేటర్ స్వయంగా తొలగించారు. సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. బాధ్యతగల పౌరులు చెత్తను చెత్తబుట్టలోనే వేయాలని ఆయన సూచించారు. ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మార్పు ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు బాధ్యతగా చెత్తను చెత్త రిక్షాలకు, చెత్త డబ్బాల్లోనే వేయాలని ఆయన సూచించారు.