Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
ఉచిత వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఫౌండేషన్ చైర్మన్ మంగమ్మ అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిది లోని సూర్యనగర్ కాలనీలో ఆదివారం కొత్తకుర్మ మంగ మ్మ శివకుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హౌమి యో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ హితం కోసం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నివారణ ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శివకుమార్, కాంగ్రెస్ తుర్కయంజాల్ గ్రామ శాఖ అధ్యక్షులు దర్శన్, డాక్టర్ రవికుమార్, సిబ్బంది రమేష్, కల్యాణి, శ్రీనివాస్, మనస్విని, నాయకులు పాల్గొన్నారు.