Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థుల, యూనివర్సిటీ సమస్యలపై ఉద్యమిస్తామని ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజు అన్నారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆదివారం నూతన విద్యార్థుల పోస్టర్ ఆవిష్కరిం చి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నవతెలంగాణ స్టూడెంట్ యూనిటీ రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను ప్రాణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిన విద్యార్థులను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం రోడ్డు మీద కొట్లాడ్డం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు శింగడే సునీల్, గణేష్, వెంకట్చారి, నరేందర్, మోహిన్, చందు, సంజరు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.