Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వాలని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంను ఆదివారం తార్నాకలోని ఆయన నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆయన మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీలో నిలబెడుతున్న సందర్భంగా మీ మద్దతు కావాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి జనసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ వినోద్ కుమార్, తెజస నాయకులు రతన్ రావు, శ్రీధర్ ఆశప్ప, చిన్న నాయక్ వినరు కుమార్ పాల్గొన్నారు