Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
బహుజన క్లాస్ టీచర్స్కు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని బీసీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.కృష్ణుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా సెలవుల్లో యాజమాన్యాల వారిగా ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఐఆర్తో సంబంధం లేకుండా పీఆర్సీ 63శాతం ప్రకటించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగావున్న 20వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వహించిన డీఎస్సీ ద్వారా ఎస్జిటి అర్హత సాధించిన వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలన్నారు . ప్రతి మండలానికి ఒక విద్యాధికారి (ఎంఈవో) నియమించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, మౌలిక సౌకర్యాల కల్పనకు స్కూల్ గ్రాంట్స్ పెంచాలని డిమాండ్ చేశారు. కామన్ సర్వీస్ రూల్స్పై నిర్ణయం తీసుకుని ఖాళీగా ఉన్న డీఈవో, ఎం ఈవో, జూనియర్ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులు రాములు, జనార్ధన్, కార్యదర్శి వేణు, నాయకులు రమేష్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.