Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న నాన్టీచింగ్ హోమ్ ఇటీవల జరిగిన పలు పరిణామాల మధ్య యూనివర్సిటీ రిజిస్టర్ చోల్లేటి గోపాల్ రెడ్డి స్పందించిన ఎట్టకేలకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దానిలో ఓఎస్డీ కృష్ణారావు చైర్మన్గా, కన్వీనర్గా ఎస్టేట్ సెల్ జాయింట్ డెరైక్టర్ డా.వెంకటేశ్వర్లు, మెంబర్స్గా ఇంజినీరింగ్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్స్ రవీందర్, కుమార్లను నియమించారు. ఇప్పటికే కమిటీ ఒక్కసారి సమావేశం కాగా మరోసారి సమావేశమై త్వరలోనే రిపోర్ట్ ఇవ్వనున్నట్టు చైర్మన్ కృష్ణరావు తెలిపారు.