Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
నేటి యువత భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి ఏ.విజరు కుమార్ పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం డీవైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజరు కుమార్ మాట్లాడుతూ .. సమాజంలోని విష సంస్కృతి సోషల్ మీడియా ఇతర కారణాల వల్ల యువత చెడు మార్గంలో నడుస్తు, దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులను గుర్తుపెట్టుకునే తీరికే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉరి తీయబడ్డ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్లను ఆదర్శంగా తీసుకుని పాలకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించాలన్నారు. అనంతరం భగత్ సింగ్ జీవిత చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. భగత్సింగ్ జయంతి ఉత్సవాల చైర్మెన్గా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కన్వీనర్గా మహేందర్లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు విప్లవ్ కుమార్, సీపీఐ(ఎం) నగర కార్యదర్శి వర్గ సభ్యులు కే.రాజన్న, డీవైఎఫ్ఐ నగర అధ్యక్షులు రమేష్, నాయకులు మల్లేష్, మధు, సందీప్, నరేందర్, అవినాష్, సంతోష్, సుదర్శన్, చంద్రశేఖర్, రాము, రసూల్, ఆదిల్, గోవింద్, పాషా పాల్గొన్నారు.