Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో పనిచేసే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సహచర కాంట్రాక్టు ఉద్యోగి యు.మల్లేష్ రెండు నెలల కింద మరణించిన విషయం తెలిసిందే. అతని కుటుంబానికి హాస్టల్స్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఒకరోజు వేతన సాయంగా రూ.లక్షా 3వేలా 248, ప్రోగ్రెస్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్, ఉస్మానియా యూనివర్సిటీ బ్రాంచీ కమిటీ ఆధ్వర్యంలో మల్లేష్ భార్య రాజమణికి చెక్ను అందజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ అధ్యక్షులు ఎస్ఎల్.పద్మ, ఓయూ కార్యదర్శి కౌసర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ, జయ, సావిత్రి, వరలక్ష్మి, వాణి, విజయ, ప్రవీణ్, విజయ, అనసూయ తదితరులు అందజేశారు. ఓయూ హాస్టల్స్ ఉద్యోగుల ఐక్యతకు, తమ సహచర ఉద్యోగి కుటుంబానికి తామున్నామని యూనియన్ ఇచ్చిన చైతన్యంతో ఆదర్శప్రాయమని యూనియన్ అధ్యక్షులు ఎస్ఎల్ పద్మ వారిని ప్రశంసించారు.