Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను నివారించవచ్చని మియాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ తెలిపారు. స్థానిక ఓంకార్ నగర్లోని గుడిసెలు వేసుకుని నివాసముంటున్న ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై ఆదివారం అవగాహన కల్పించారు. ఉదయం నుంచి పోలీస్ సిబ్బందితో పాటు ఐటీ ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్లు కాలనీను శుభ్రపరిచారు. స్థానిక స్కూల్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి మొక్కలు నాటారు. అనంతరం రామచంద్రపురం ఆయుష్ హోమియోపతి డాక్టర్లచే స్థానికులకు హోమియోపతి గుళికమాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయుష్ హోమియోపతి వైద్యులు స్వామి, హరి, లింగరాజు, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది, డీఐ మహేశ్, ఎస్ఐలు లింగనాయక్, రఘురాం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.