Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
గాజులరామారం డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటంచేసి సాధిస్తానని కార్పొరేటర్ రావుల శేషగిరి తెలిపారు. మహాదేవపురం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్ధానికులతో కలిసి ఆదివారం పర్యటించారు. అందులో భాగంగా డివిజన్ పరిధిలోని మహాదేవపురం, ఫేజ్-2 ప్రాంతంలోని రోడ్లు, ఎల్లమ్మ బండకు వెళ్లే ప్రధాన రహదారిని, ప్రమాదకరంగా రహదారి ప్రక్కన ఉన్న పెద్ద బండరాళ్లను పరిశీలించారు. మహాదేవపురం, ఫేజ్-2లో రోడ్లపై మురుగునీరు నిలిచిదోమలు పెరుగుతున్నాయని స్థానికులు వివరించారు. ఎల్లమ్మ బండకు వెళ్లే ప్రధాన రహదారిలో సిక్ల నివాసాల వద్ద రహదారిని, ప్రమాదకరంగా రహదారి ప్రక్కన ఉన్న పెద్ద బండరాళ్లను తొలగించాలని సూచించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. సత్వరమే దోమలు నివారన చర్యలు చేపట్టడంతో పాటు ప్రదాన రహదారి ప్రక్కన ప్రమాద కరంగా ఉన్న పెద్ద బండరాళ్లను తొలగించేందుకు మున్సిపల్ అధికారులతో చర్చించి వెంటనే తొలగింప చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరిరెడ్డి, సంయుక్త కార్యదర్శి జగధీశ్వర్రెడ్డి, ఫేజ్-2 ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.