Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఈ నెల 28,29 తేదీలలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని కాటేదాన్ టీఎల్ఎం ఫంక్షన్హాల్లో జరిగే బీసీడబ్ల్యూ రెండో మహాసభలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆహన్న సంఘం అధ్యక్షులు మస్కు నర్సింహ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కాటేదాన్ మహాసభలను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో అన్ని రంగాలలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కారించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విఫలమయిన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో కార్మికుల ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం లో భవన నిర్మాణ రంగ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణ సంఘ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీసీడబ్ల్యూ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 28,29 తేదీలలో జరిగే బీసీడబ్ల్యూ మహాసభలను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందని ఆయన సృష్టం చేశారు. ఈ మహాసభలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవు తున్నారన్నారు. ఈ ర్యాలీలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగదీశ్, చంద్రమోహన్, కోశాధికారి మల్లేష్, బీసీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కురుమయ్య, కవిత, కిషన్, జీ.రుద్రకుమార్, ఎస్ఎఫ్ఐ జోన్ కార్యదర్శి ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.