Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
మనిషి భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని మార్పు చేస్తూ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదర్గూడలోని సెంట్రల్ పార్క్ హౌటల్లో 'కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ' శిక్షణపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ సైకాలజిస్టులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా వారి నైపుణ్యాలను పెంపొందించడానికి తమ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందన్నారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో వివిధ రకాల భావోద్రేక రుగ్మతలు, క్లినికల్ సమస్యలకు సాక్ష్యాధారిత చికిత్సా పద్ధతులపై శిక్షణ పొందే వారికి ఈ వర్క్ షాప్ ఒక రిప్రెషర్ కోర్సుగా పునాధిని అందిస్తుందన్నారు. తమ సంస్థ ద్వారా తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ శిక్షణను బెంగళూరుకు చెందిన ప్రముఖ క్లినికల్ సైకాల జిస్ట్, ప్రొఫెసర్ డాక్టర్ మంజుల, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ పౌలోమిలు శిక్షణ అందిస్తున్నారన్నారు. కాగ్నిటివ్ థెరపీ చురుకైన, నిర్దేశకం, సమయ కట్టుబాటు, నిర్మాణా త్మక విధానం, వ్యక్తి ప్రవర్తనలో మార్పు తీసుకురావడా నికి ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వినీష, ఏ.వి.శాంతి, సురేష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, శివరామ ప్రసాద్, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటరావు పాల్గొన్నారు.