Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ రిపోర్టర్: పీబీ శ్రీనివాస్ గళం స్వర మాధుర్య మని తెలం గాణ వ్యాట్ అప్పిలియేట్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ డాక్టర్ జీ.రాధారాణి అన్నారు. సప్తస్వర మాళిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలోని కళాలలిత వేదికపై ఆదివారం మురళీధర్ సారధ్యంలో అలనాటి నేపథ్య గాయకుడు డాక్టర్ పీబీ శ్రీనివాస్ 89వ జయంతి వేడుక నిర్వహించారు. మురళీధర్, విజయలక్ష్మి, ఉమ, వసంతలక్ష్మి, పద్మ, లక్ష్మి, రజిని తదితరులు శ్రీనివాస్ పాడిన సోలో యుగళ గీతాలను స్వర రాగ మధురంగా ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జి.రాధారాణి పాల్గొని కళాకారులను అభినందించారు. యువ కళా వాహిని అధ్యక్షులు వై.కే నాగేశ్వర్రావు, ఎడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(రిటైర్డ్) సీఎల్ఎం గాంధీ గీత స్వరకర్త కృష్ణమోహన్ తదితరులు సభలో పాల్గొన్నారు.