Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
విద్యతో పాటు విద్యార్థులు తమ చుట్టూ వున్న సమా జం, ప్రజలు, క్రీడలు, ఇతర అంశాల పట్ల అవగాహనా ఉండాలని కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల శాఖ సహాయ కార్య దర్శి అభిషేక్ సూచించారు. భవిష్యత్ దేశానికి ఆశాకిరణాలు విద్యార్థులేనన్నారు. వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ ఏడో వార్షికోత్సవం రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహిం చారు. కందా బీమశంకరం, పాపాయమ్మ స్మారక అవార్డు లు-2019 కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. వక్తృత్వం, వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు బహుమతుల ప్రదాన సభ నిర్వహించారు. అభిషేక్ పులుమట్ల పాల్గొని విద్య ఉన్నంత మాత్రాన సంపూర్ణ మానవులు కాలేరన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లా డుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థు లెందరో ఉన్నత స్థానాల్లోకి ఎదిగారన్నారు. డాక్టర్ మోహన్ కంద మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగివున్న శక్తిని వెలికితీసేందుకు ప్రతి యేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోని 41 కేంద్రాల్లో ప్రాథమిక స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 5500 మంది విద్యార్థులు పాల్గొన్నారని అందులో నుంచి 200 మందిని తుది పోటీలకు ఎంపిక చేశామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్మారక బహుమతులు విజేతలకు అందజేస్తున్నా మన్నారు. వారధి ఫౌండేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్వీఎల్ నాగరాజు, పారిశ్రామికవేత్త రాకేశ్కుమార్, విజయవాడ మాజీ మేయర్ జంద్యాల శంకర్ పాల్గొన్నారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో ఏపీ నుంచి కే.శివ శంకర్, శ్రీజ, జరీనాలు తెలంగాణ నుంచి ఎస్.హరిణి, వినీత, మనస్విని, వక్తృత్వ పోటీల్లో ఎస్.సాయి చందన, కే.సాయి చందన, కావ్య, సంయుక్తలు, తెలంగాణ నుంచి బన్నీ, భాస్కర్, ఏ.సూరీలకు నగదు బహుమతులను అందజేశారు.