Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన టీపీఆర్ సేన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేస్తున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రఫూల్ రాంరెడ్డి తెలిపారు. ఆదివారం భోలక్పూర్లోని టీపీఆర్ సేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో యువతకు పెద్ద పీట వేసి వారికి కమిటీలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నియోజక వర్గంలో గత కొన్నేండ్లుగా అనాధ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిం చటం, వికలాంగులకు వీల్ చైర్లు అందించటం వంటివే కాకుండా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బస్తీలల్లో పేదలతో కలసి బతుకమ్మ, బోనాలు వంట ఉత్సవాలను నిర్వహించామన్నారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గానికి పి.నర్సింగ్రావు, జి.సూర్యనారాయణ, సనత్ నగర్ నియోజకవర్గానికి డి.కౌశిక్, బి.రాజులను, సికింద్రాబాద్ నియోజక వర్గానికి డి.శ్రీనివాస్, ఆర్.భాస్కర్లను, ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎం.సునీల్ రెడ్డి, ఆర్.వేణుగోపాల్ లను, అంబర్పేట్ నియోజకవర్గానికి గాను కే.సాయికుమార్, ఆర్.రాహుల్లను, గోషామహల్ నియోజకవర్గానికి ఎన్.అమరేందర్, ఎస్.పురుషోత్తంలను, జూబ్లీహిల్ నియోజకవర్గానికి పి.లక్ష్మణ్, కే.మురళీధర్లు ఎన్నికయ్యారు.