Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 20న ప్రారం భమైన సరస్ మేళా-2019 అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. ఆర్ధికమాంద్యం, ధరలు పెరుగుదల, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సారి ఈ మేళాపై వాటి ప్రభావం ఏమాత్రం చూపటం లేదు అనటానికి పెరిగిన అమ్మకాలే నిదర్శనంగా చెప్పవచ్చు. గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్ర ప్రభు త్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 'సరస్ మేళా' ఏడాదిలో రెండుసార్లు నిర్వహించటం గత 20 ఏండ్లుగా కొనసాగుతుంది. దాదాపు 300 స్టాల్స్ లో అందరూ ఇష్టపడే సహజసిద్ధమైన వస్తువులు, అన్ని రకాల చేనేత బట్టలు, కళా ఖండాలు, తిను బండారాలు, జ్యూట్ బ్యాగులు, రకరకాల చెప్పులు వంటి అనేక రకాలైన గృహౌ పకరణాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ఉత్పత్తి దారులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటుచేసిన ఈ మేళాలో పోచంపల్లి చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ఉత్తర్ ప్రదేశ్ చేనేత వస్త్రాలు, ఛత్తీస్ఘడ్ బ్రాస్ ఐటమ్స్, రాజస్థాన్ గాజులు, ఒడిశా పెయింటింగ్స్ ఈ ప్రదర్శనలో పెట్టటం ద్వారా అసలైన కళాకా రులకు ప్రోత్సాహంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కనుమరుగైపోతున్న కళలకు జీవం పోసే విధంగా ఈ మేళాలు నిర్వహించటం పట్ల ఉత్పత్తి దారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన సందర్శకులకు సమయం తెలియకుండా, ఏది చూసినా ఆకర్షిస్తూ ఉండటంతో వారికి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు మొబైల్ ఏటియం, మొబైల్ టాయిలెట్స్ తో పాటు రకరకాల రుచులతో ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటుచేయటంతో సందర్శ కులు కుటుంబ సమేతంగా ఉదయం నుండే ఇక్కడకు వచ్చి ఆనందంగా తమకు కావల్సిన వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. అన్ని రకాల వ్యక్తులను, అన్ని వయసుల వారిని ఆకర్షిస్తున్న ఈ మేళా అక్టోబర్ 1 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
సహజ సిద్ధమైన వస్తువులు ఒకే చోట
అందరికీ నచ్చే విధంగా సహజ సిద్ధమైన వస్తువులు ఒకే చోట ఏర్పాటు చేయటం అభినంద నీయం.మొట్టమొదటి సారి వచ్చాము. ఇది కేవలం ఉత్పత్తి దారులకే కాకుండా మాకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఏది చూసినా కొనాలని పించే విధంగా ఉన్నాయి.
- సునీత, మియాపూర్
తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు
బయట షాపింగ్ మాల్స్లో అమ్మే వస్తువులతో పోలిస్తే చాలా తక్కువ ధరలకు ఇక్కడ దొరుకు తుంటాయి. ప్రతి సంవత్సరం ఎప్పుడు పెట్టినా వస్తూ ఉంటాము. మహిళలకు నచ్చే విధంగా ఈ ప్రదర్శన ఉంటోంది. డ్వాక్రా మహిళలు చేసిన తినుబండారాలు ఎంతో నాణ్యమైనవిగా, రుచిగా ఉంటున్నాయి.
- సావిత్రి, చిక్కడపల్లి