Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
తమ సొసైటీ స్థలాన్ని కబ్జాదారులు నుంచి కాపాడాలని మియాపూర్ న్యూసైబర్ వ్యాలీ అసోసియేషన్ సభ్యులు కోరారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచందర్రావు మాట్లాడుతూ.. షేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వేనెబర్ 45లో గొట్టిముక్కల జగన్నాథం రాజు దగ్గర మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 50 మంది 100 గజాలు , 200 గజాలు ఇంటి స్థలాలను కొనుగోలు చేసి అనంతరం 50 మందితో న్యూ సైబర్ ర్యాలీ అనే అసోసియేషను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నామన్నారు. కొన్నేండ్లుగా తమ మిగిలిన స్థలాన్ని కబ్జా చేయడానికి నకిలీ పత్రాలను సృష్టించారని తెలిపారు. 2010 , 2012, 2015, 2016లో ఈస్థలంపై కబ్జాదారులు కేసు వేయగా తమ అసోసియేషన్ సభ్యులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. అయినా 2019 ఆగష్టులో రాజేంద్రనగర్ ఆర్డీవో తీర్పులు ఉన్నప్పటికీ ఆర్డీవో మాత్రం కబ్జాదారులకు అనుకూలంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని వారు వాపోయారు. గతంలో తమ పిటిషన్ను కలెక్టర్ రెవెన్యూ మంత్రుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీంతోపాటు ఆర్డీవో సర్క్యూలర్పై తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. అయినా సరే కబ్జాదారులు ఆ ప్రాంతంలో కూర్చొని తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో ఈ వివాదం ఉన్నప్పటికీ కబ్జాదారులు తనపై కక్ష కట్టి తమను వేధింపులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని వాపోయారు. తమకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచందర్రావు ప్రధాన కార్యదర్శి రవీందర్, నాగేశ్వరరావు జై గోపాల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.