Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలో వాస్తవ పరిస్ధితులకు అనుగుణంగా రూపొందించారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చల్లో వివేకానంద్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక మాంద్యం ఛాయలు కనబడుతున్న తెలంగాణ ఆదాయ వృద్ధిలో జీఎస్టీలో జాతీయ సగటు ఆదాయం కంటే ముందున్నామని చెప్పారు. ఆర్థిక మాంద్యం కారణంగా రాబడులు తగ్గుతున్నా, కేంద్రం గ్రాంటుల్లో కోత విధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 35,527.70కోట్ల నిధులు తగ్గిచాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం 1,46,492.30 కోట్లతో బడ్జెట్ను రూపొందించిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేకుండా టీఆర్ఎస్ నిస్వార్థ పాలనందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాదే పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రానికి రావలిసిన వాటాలో కేంద్రం 4.9 శాంతం కోత పెట్టిందన్నారు. ఐదేండ్లలో కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 2,72,926 కోట్ల ఆదాయం పంపించగా అందులో కేవలం 31,802 కోట్లు రాష్ట్ర వాటాకి తిరిగిచ్చారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ చరిత్రలోనే అత్యధికంగా వ్యవసాయ శాఖకు 20,566.36 కోట్లు వెచ్చించినట్టు తెలిబీపారు. అందులో రైతుబంధుకు 12వేల కోట్లు, రైతు రుణ మాఫీకి 6 వేల కోట్లు, రైతు బీమాకు 1,137 కోట్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల రాయితీకి 304కోట్లు కేటాయించడం రైతుల పట్ల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కేటీఆర్ చేపట్టిన ప్రత్యేక ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఐటటీ రంగం పురోభివృద్ధికి , పరిశ్రమల స్ధాపనకు దోహద పడ్డాదన్నారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20శాతం పెంచడంలో మిషన్ భగీరథ పథకానికి జాతీయ స్థాయిలో 3 అవార్డులు దక్కాయన్నారు. ఈ అవార్డులను ఈనెల 25 అందుకోబోవడం ఎంతో గర్వంగా ఉందని వివరించారు.