Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హాదా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఐద్వా రాష్ట్ర కమీటి హర్షించింది. ఐద్వా రాష్ట్ర సెంటర్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెన్ ఆశాలత, మల్లు లక్ష్మి లు మాట్లాడుతూ.. ఆర్మీలో పురుషులతో సమానంగా మహిళలకు కమాండ్ పోస్టులు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. స్పల్పకాలిక సర్వీసులో ఉన్న మహిళా అధికారుల నియామాకాలు పర్మినెంట్ కమిషన్ కింద తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం నాడు చారిత్రాత్మక తీర్పునిచ్చిందని కొనియాడారు. మహిళా అధికారులందరికి శాశ్వత కమిషన్ హాదా వర్తిస్తుందని పేర్కొనడం గోప్ప విషయమన్నారు. ఆధునిక మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తుంటే మరో పక్క కేంద్రప్రభుత్వం మహిళల శారీరక లక్షణాలకు వారి హక్కులకు ముడిపెడుతూ కమాండ్ పోస్టులకు వారు అర్హులు కారనే వాదన కరెక్ట్ కాదన్నారు. మహిళలు కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమనే ఆలోచనా ధోరణి మారాలని సుప్రీంకోర్టు చెప్పడం కేంద్రానికి చెంపపెట్టు అన్నారు. కేంద్రం చేసిన వాదనలను స్టీరియోటైపు వాదనలని బెంచ్ కొట్టిపడేసిందన్నారు. మొదట మారాల్సింది మైండ్ సెట్ అని స్పష్టం చేసిందన్నారు. కమాండింగ్ పదవుల్లో మహిళలకు స్థానం నిరాకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణానికి అంటే సమానత్వపు హక్కుకు విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయ పడిందన్నారు. శారీరిక ఇబ్బందులను సాకుగా చూపి మహిళలకు పురుషులతో సమానమైన స్థాయి నిరాకరించడం మౌలికంగా చెల్లదన్నారు.