Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నాధర్గుల్ డ్రయినేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని మంగళవారం కార్పొరేటర్ నిమ్మల సునితాశ్రీకాంతగౌడ్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహ్మరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని విజయ లక్ష్మి కాలనీలో డ్రయినేజీ పైపులైన్ పూర్తిగా పగిలిపోయి ఏండ్లు గడు స్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదనవ్యక్తం చేశారు. వి జయలక్ష్మి నగర్కాలనీ, శాంతినగర్ కాలనీలో డ్రయినేజీ, సెప్టిక్ట్యాంక్లకు మ రమ్మతులు చేయించాలని మేయర్ను కోరారు. పలు కాలనీల్లో మురుగు నీరు రోడ్లపై ప్రవహించి దోమలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. పరి సరాలు పరిశుభ్రంగా ఉంటేనే కాలనీలోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకోసం అధికారులు సహకరించాలని ఆమె తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ డీఈ అశోక్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో కార్పొరేషన్ బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్గౌడ్, మర్రి అంజీరెడ్డి, పాల్వాయి శ్రీను, కాలనీవాసులు పాల్గొన్నారు.