Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్క రూ కృషి చేయాలని, తడిచెత్త, పొడ ిచెత్తను వేరుచేసి ఆటో రిక్షాలలోనే వేయాలని శానిటేషన్ అధికారి యాదగిరి అన్నారు. మంగళవారం సిబ్బందితో కలిసి రోడ్లకు ఇరువైపులా చెత్తను జేసీబీ సహ యంతో శానిటేషన్ సిబ్బందితో కలిసి తొ లగించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మేయర్ చిగురింత పారి జాతనర్సింహ్మరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్య క్రమాలు చేప డుతున్నామన్నారు. పరి సరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటా రన్నారు. మున్సిపల్ సిబ్బంది ఎప్ప టికప్పుడూ పరిసరాలను పరిశుభ్రంగా ఉం డేటట్టు పనిచేయాలని సూచించారు. బడం గ్పేట మున్సిపల్ కార్పొరేషన్ను చెత్త రహిత కార్పొరేషన్గా తీర్చిదిద్దాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
హరీష్రావుకు రజక సంఘం నేతల వినతినవతెలంగాణ-వనస్థలిపురం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేద రజకులకు రాబోయే బడ్జెట్లోనైనా రూ.1000 కోట్లను కేటా యించాలని తెలంగాణ రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగ్గ అనిల్కుమార్ డిమాండ్ చేశారు. తెలం గాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హారీష్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వారు రజకులేనన్నారు. 50 ఏండ్లు నిండిన రజకులకు ఆసరా ఫించన్లతో పాటు రు ణాలు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకేళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో రజకసంఘం నాయకులు బాలకృష్ణ, నర్సింహ్మ, బాలస్వామి, బాలయ్య, పాల్గొన్నారు