Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట
శారీరకంగా వికలాంగులవుతారు కానీ మ నసికంగా కాదని కమిట్మెంట్స్ సంస్థ డైరెక్టర్ అభి సరస్వతి బాబు అన్నారు. మంగళవారం కొత్త పేటలోని రాధా ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ చాలెం జ్డ్లో అరబిందో ఫార్మా సహకారంతో కమిట్ మెంట్స్ సంస్థ 150మంది వికలాంగులకు హెల్త్ కిట్, టీ షర్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక స్థ్యైర్యాన్ని పెంపొం దించడానికి కమిట్మెంట్స్ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ వికలాంగుల వెంట ఉంటోందన్నారు. పోషణ సరిగా లేని విద్యార్థులకు పౌష్టికాహరం అందిస్తూ వారి ఆరోగ్య స్థితి మెరుగుపడేందుకు సంస్థ ఎంతో కృషి చేస్తోందన్నారు. వికలాంగులైన పిల్లలకు ప్రతి ఒ క్కరికీ విద్యాబుద్దులు నేర్పించేందుకు సంస్థ ఎప్పుడూ ముం దుంటోందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని వికలాంగ విద్యార్థుల సౌ కర్యార్థం అరబిందో ఫార్మా సహకారంతో ర్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు. వారికి జీవనోపాధి కల్పిస్తూ, వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రోత్స హిస్తున్నామన్నారు. అనం తరం విద్యార్థులకు హెల్త్ కిట్లను, టీ షర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఎయిడ్ యాక్షన్ సంస్థ మెనేజర్ చంద్రకిరణ్, కమిట్మెంట్స్ మెనేజర్ వెంకట్రావు, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ ఆశ్విని, రాధా ఇన్స్టి ట్యూట్ డైరెక్టర్ సుధారాణి, కీర్తన, నాగమణి, విజ యలక్ష్మి, యాదలక్ష్మి, విజయకుమారి, శ్యామల పాల్గొన్నారు.