Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హయత్నగర్ డిప్యూటీ కమి షనర్ మారుతి దివాకర్ అన్నారు. మంగళవారం శానిటేషన్ పర్యవేక్షణలో భాగంగా నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్టౌన్ కాలనీలో రోడ్లను పరిశుభ్రంగా శానిటేషన్ సిబ్బందికి సూచించారు. సిబ్బంది సకాలంలో హజరై రోడ్లను పరి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. జవాన్లు, ఎస్ఎఫ్ఏ (శానిటేషన్ ఫిల్డ్ అసిస్టెంట్)లు ఉదయం 5గంటలకే పనులను మొదలుపెట్టాలని కోరారు. రోడ్లను పరిశుభ్రంగా ఉంచకపోయినా, స్విపింగ్ చేయకపోయినా, చెత్త కుప్పలను ఎత్తకపోయినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.