Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రైతాంగ సమస్యలపై సహకార సొసైటీ సంఘం సభ్యులు దృష్టి సారించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మంగళవారం కీసర సహకార సొసైటీ చైర్మెన్ రామిడి ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మెన్ పన్నాల బుచ్చిరెడ్డి, డైరెక్టర్లు మంత్రిని మర్యా దపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతులకు ప్రభుత్వం అందించే రుణాలు,ఎరువులు,విత్తనాలు సకాల ంలో రైతులకు అందేలా సహకార సంఘం సభ్యులు పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బెస్త వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు నాయకపువెంకటేష్, శ్రావన్కుమార్గుప్త, పూలగుర్లశ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు.