Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
వేసవి కాలం సమీపిస్తుండడంతో నీటి కొరత లేకుండా ప్రతీ ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్నగర్ డివిజన్లోని వాజ్పేరునగర్లో మంగళవారం 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ బద్దం పుష్పలతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన డివిజన్లోని పలు బస్తీల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, వీధిదీపాలు, కమ్యూనిటీహాల్, తదితర మౌలిక వసతులను ఆయన దృష్టికి స్థానికులు సుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజక వర్గంలోని తొమ్మిది డివిజన్లలోనూ మంచినీటి కొరత లేకుండా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇప్పిస్తున్నామ న్నారు. స్థానికులు సూచించిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్దం పరుశురాంరెడ్డి, ప్రేమ్కుమార్, జీఎన్వీ.సతీష్, మడిపడిగె జగదీష్గౌడ్, ప్రభాకర్రెడ్డి, చంద్రకాంత్, ఫరీద్, అరుంధతి, రజిత, అరుణ తదితరులు పాల్గొన్నారు.