Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల కోసం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సోమవారం జేజే ఆసుపత్రి అధినేత, జేజే ఫౌండేషన్ చైర్మెన్ జయంతిరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్ సామలహేమ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్కామాక్షి దేవి మాట్లాడుతూ బాలికలు ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. ప్లాస్టిక్లో ఉంచిన ఆహార పదార్థాలు తినకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజిత, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, సయన్వయ కర్త సరోజ, కళాశాల మహిళా సంఘం కన్వీనర్ నిర్మల, సభ్యులు జ్యోతి, సమతా, హరి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.