Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ఏడోవార్డులో కంటి సమస్యతో బాధపడుతున్న వారికి తిరుమ లగిరి సాయిబాబా హాట్స్ వద్ద మంగళవారం కంటోన్మెట్బోర్డు సభ్యుడు ప్యారసాని శ్యామ్ కుమార్ కంటి అద్దాలను పంపిణీ చేశారు. వార్డులో స్థానికులు కంటి సమస్య ఇతర వ్యాధులు లేకుండా నివారించేందుకు ప్రతీ ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వ హిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.