Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
అల్వాల్ సర్కిల్లోని సాయినగర్ కాలనీ వాసులతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కో-ఆప్షన్ సభ్యురాలు జ్యోతి శ్రీనివాస్గౌడ్, సర్కిల్ అధికారులతో కలిసి స్థానిక సమస్యలపై కాలనీలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చౌహాన్ కాలనీలో రోడ్లు, పార్కుల అభివృద్ధి, కమిటీ హాల్, వ్యాయామానికి సంబంధించిన పరికరాలు, వీధి దీపాలు, డ్రైయినేజీ, రోడ్లు తదితర సమస్యలను సమావేశంలో స్థానికులు ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులు సూచించిన సమస్యలను అధికారులు ప్రణాళికలు రూపొందించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డివిజన్లో సమస్యలును తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ఈఈ రాజు, డీఈ మహేష్ కొండల్ రెడ్డి, శ్రీనివాస్గౌడ్, చంద్రశేఖర్, మాణిక్రెడ్డి, బలవంత్రెడ్డి, కరుణా, ప్రవీణ్, కవిత, సరిత పాల్గొన్నారు.