Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలియాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్యాదవ్వార్డు సభ్యుడు లింగం
నవతెలంగాణ-శామీర్పేట:
పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్ కుమార్ను వెంటనే సంస్పెండ్ చెయ్యాలని అలియాబాద్ ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్యాదవ్, ఒకటోవార్డు సభ్యుడు కనకలలింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రం శామీర్పేటలో మంగళవారం విలేఖరుల సమావేశంలో అలియబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, కనకలలింగం మాట్లాడారు. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఏడాదిలోనే వివిధ రకాల పంచాయతీ నిధులు సుమారు రూ.70లక్షల అనీతికి పాల్పడినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా సాక్ష్యాధారాలు సేకరించినట్టు తెలిపారు. పంచాయతిరాజ్ చట్టానికి వ్యతిరేఖంగా వార్డు సభ్యులు, పాలక వర్గం తీర్మాణం లేకుండా పంచాయతీ కార్యదర్శి సంతకాలూ లేకుండా సర్పంచ్ గుర్క కుమార్ ప్రజల సొమ్మును దిగమింగుతున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్యాదవ్, ఒకటో వార్డు సభ్యుడు కనకల లింగం, మధుసుధన్, తదితరులు పాల్గొన్నారు.