Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిలకలగూడ
ఫిబ్రవరి 8, 9తేదీలలో బషీర్బాగ్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ కిగ్బాక్సింగ్ పోటీలలో మెడల్స్ సాధించిన విద్యార్థులను సోమవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసంలో వారిని అభినందిచారు. బోయగూడాలోని జయనగర్ కాలనీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రాజు, మాధవి దంపతుల కుమార్తెలు అరవింద గోల్డ్ మెడల్ని, భానుప్రియ బ్రౌన్స్ మెడల్స్ని సాధించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లో రాణించే విద్యార్థులకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.