Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జీడిమెట్ల
జీడిమెట్ల డిపో నుంచి శివ రాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని సామాజిక కార్యకర్త కోల రవీందర్ముదిరాజ్ జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాయల జాతర, కీసర శివరాత్రి ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివెళ్తారని అన్నారు. ప్రతి ఏడాది బస్సు సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారని షాపూర్నగర్, జీడిమెట్ల, సూరారం, సుచిత్రా తదితర ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపించాలని విజ్ఞప్తి చేశారు.