Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
అధికారుల సహకారంతో ఆర్యూబీ పనులను సకాలంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం ఈస్ట్ ఆనంద్బాగ్ ఆర్యూబీ పనులను జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఆయా విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరేండ్ల కింద ఆర్యూబీ పనులకు తవ్వకాలు ప్రారంభించా మన్నారు. దీనికి ఇరుపక్కల ఇంటి యజమానులు పనులు ఆపాలని కోర్టును ఆశ్రయించడంతో పనులు పూర్తి పెండింగ్లో ఉంన్నాయన్నారు. ఇంటి యజమానులను సంప్రదించి వారికి ప్రభుత్వ ద్వారా నష్టపరిహారం చెల్లించామన్నారు. త్వరలోనే ఆర్యూబీ పనులను పూర్తి చేసి వాహానదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు జగదీష్గౌడ్, ఆకుల నర్సింగరావు, నాయకులు బద్దం పరుశురాంరెడ్డి, ప్రేమ్కుమార్, జితేందర్రెడ్డి పాల్గొన్నారు.