Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్లో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని గణేష్మందిర్ వెనుక తెనుగుబస్తీలో రూ.10 లక్షలతో వీడీసీసీ రోడ్డు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ ఆనంద్, ఏఈ పవన్, సర్పంచ్ వెంకటేశ్, వార్డ్ కమిటీ సభ్యులు శ్రీను, బిక్షపతి, సత్యనారాయణ, రాము, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస చారి, కరుణాకర్, కృష్ణా చారి, పాల్గొన్నారు.
ఇంద్రాహిల్స్లో
కేపీహెచ్బీ : ఆల్విన్ కాలనీ డివిజన్లోని ఇంద్రాహిల్స్ కాలనీలో చేపట్టిన రోడ్డు పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్గౌడ్ మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంద్రాహిల్స్ హైటెన్షన్ డబుల్ రోడ్డు వేసి డివైడర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, వార్డ్ సభ్యులు కాశీనాథ్యాదవ్, నాయకులు శివరాజ్గౌడ్, కర్నాటక రాజు, విక్రమ్, జోసెఫ్, రమేష్, మోహన్, రాజునాయక్, గోపాల్ నాయక్, దయానంద్, సుధీర్, విక్రమ్, బాబుసాగర్ పాల్గొన్నారు.
కేపీహెచ్బీ డివిజన్ గోపాల్ నగర్ కాలనీలో గల స్థానిక సమస్యలపై డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులు, వార్డ్ సభ్యులు, స్థానిక వెల్ఫేర్ సభ్యులతో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో డీఈ శ్రీదేవి, ఎస్ఆర్పీ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్చార్జి అడుసుమిల్లి వేంకటేశ్వర రావు, అధ్యక్షులు సాయిబాబా చౌదరి, వార్డ్ సభ్యులు హరిబాబు పాల్గొన్నారు.