Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
సంత్ సేవాలాల్ 281వ జయంతి వేడుకలను గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీలో మంగళవారం నిర్వహి ంచిన ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం జిల్లా నాయకులు కె.కృష్ణానాయక్, బాచుపల్లి మండల 20వ వార్డ్ కార్పొరేటర్ బాలాజీనాయక్, దుండిగల్ కౌన్సిలర్ శంకర్ నాయక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన సంఘాలు ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. ప్రకృతిని, సమాజాన్ని అర్థం చేసుకుని, ప్రకృతి ధర్మాన్ని కాపాడాలన్నారు. 12ఏండ్ల వయసులోనే సేవా మార్గాన్ని ఎంచుకున్న నాయకుడు, బంజారాల జీవిగతాల్లో వెలుగులు నింపిన సేవా మూర్తి సంత్ సేవాలాల్ అని కొనియాడారు. అడవి సంపద, నీళ్లు, వనరులను కాపాడాలని పిలుపునిచ్చిన సేవాలాల్ బంజారాల సంస్కృతి, పుట్టుక, పెండ్లి, చావు, భాష వేషధారణ, పండుగల పైన ఇతర మతాల ప్రభావం పడకుండా జీవించాలనేవారని గుర్తుచేశారు. సేవాలాల్ త్యాగం, నీతి, వీరత్వం, గోర్ సమాజం కోసం ఉపయోగపడాలని బంజారా నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జె.శివ కుమార్, కూకట్పల్లి మండలాధ్యక్షులు పి.గోపాల్, నాయకులు ఏ.లక్ష్మణ్, భాష, చిరంజీవి, ఆర్.శ్రీను, కృష్ణ, మధు, గోపి, మంగ్య, కె.బోజ్యనాయక్ పాల్గొన్నారు.